Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్గా బాహుబలి రైటర్ న్యూ ప్రాజెక్ట్.. పెద్ద హీరోలు ఒప్పుకోవడం లేదా?
ఒక సినిమా సక్సెస్ కావడానికి ముఖ్య కారణం కథ, కథనం. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలి అంటే ముందుగా కథ చాలా ఆసక్తికరంగా ఉండాలి. ఇక అలాంటి కథలను అందించడంలో ముందుంటారు రైటర్ విజయేంద్రప్రసాద్. ఆయన రాసిన కథలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
స్క్రిప్ట్ రెడీ..
బాహుబలి లాంటి సినిమా తెరకెక్కడానికి మూల కారణమైన రైటర్ విజయేంద్రప్రసాద్ మళ్ళీ డైరెక్షన్ చేయరా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఇక ఫైనల్ గా ఆయన ఒక యువ హీరోతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఈ రైటర్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట.
నాలుగు సినిమాలే..
రైటర్ గా విజయేంద్రప్రసాద్ సక్సెస్ అయినప్పటికీ దర్శకుడిగా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇప్పటివరకు ఆయన నాలుగు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. అర్దాంగి, శ్రీ కృష్ణ, రాజన్న, శ్రీ వల్లి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయేంద్రప్రసాద్ మెగా ఫోన్ పట్టి మూడేళ్లవుతోంది.
ఆ ఒక్క సినిమా..
ఆయన కెరీర్ లో రాజన్న సినిమా మాత్రమే కాస్త మంచి విజయాన్ని అందుకుంది. కొడుకు కోసం అద్భుతమైన కథలు రాస్తున్న విజయేంద్రప్రసాద్ తన కోసం రాసుకోలేడా అనే కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా పెద్ద హీరోలతో వర్క్ చేయరా? అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇటీవల ఒక కుర్ర హీరోతో కొత్త తరహా మూవీని స్టార్ట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Recommended Video
పెద్ద హీరోలు ఒప్పుకోలేదా?
బాహుబలి మొదటి పార్ట్ నుంచి విజయేంద్రప్రసాద్ పెద్ద హీరోలతో ఎలాగైనా ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నారట. రైటర్ గా ఆయన కథలను హ్యాపీగా వింటున్న హీరోలు ఆయన డైరెక్షన్ అనగానే సైడ్ అయిపోతున్నారని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని విజయేంద్రప్రసాద్ మాత్రం తన దగ్గర ఉన్న కొన్ని కథలను ఎలాగైనా తన డైరెక్షన్ లోనే తెరకెక్కించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.