Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజమౌళి - మహేశ్ మూవీలో విలన్గా స్టార్ హీరో: వామ్మో జక్కన్న ప్లాన్కు పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే
తెలుగు సినీ ఇండస్ట్రీలోని సినీ ప్రియులంతా కొన్ని కాంబినేషన్ల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఫలానా దర్శకుడితో ఫలానా హీరో చేయాలని ఆశ పడుతున్నారు. అలాంటి కలయికలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది కోరుకుంటోన్న వాటిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఒకటి. సుదీర్ఘమైన నిరీక్షణకు తెరదించుతూ వీళ్లిద్దరూ ఓ సినిమాను చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అటు రాజమౌళి.. ఇటు మహేశ్ బాబు ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
మహేశ్ బాబు అలా.. రాజమౌళి ఇలా
చాలా రోజులుగా వరుసగా హిట్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, రాజమౌళి ఇప్పుడు RRRను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్తో రిలీజ్ కాబోతుంది.
లవర్తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ
మహేశ్ రాజమౌళి కాంబోలో సినిమా
ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా ఎదిగిపోయిన రాజమౌళి తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారని కూడా పేర్కొన్నాడు. అయితే, ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి దీనిపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఆయనకు ఆ బాధ్యతలు అప్పగింత
మోస్ట్ వెయిటెడ్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్కు అప్పగించాడు జక్కన్న. ఆయన చాలా రోజులుగా ఈ మూవీ కథపై వర్క్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ మధ్య తెలిపాడు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్
అలాంటి కథ.. ఇలాంటి కథ అంటూ
మహేశ్.. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. అడ్వెంచర్ కథతో తెరకెక్కుతుందని ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
వీళ్లిద్దరి సినిమా ఇప్పుడు కాదు అని
నిజానికి మహేశ్ బాబు.. రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సూచన మేరకు మహేశ్ బాబు.. త్రివిక్రమ్తో సినిమాను చేస్తున్నాడని అంటున్నారు. ఇది పూర్తయ్యాకే అది మొదలవుతుందట.
బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం
ఈ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో మహేశ్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అలాగే, ఇందులో విలన్గా చేసేది కూడా స్టార్ హీరోనే అని అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
Recommended Video
విలన్గా నటించబోతున్న స్టార్ హీరో
క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమాలో మహేశ్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించబోతున్నాడట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు కూడా జరిపిందనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడంతోనే విక్రమ్ను ఎంచుకున్నారట. ఇందులో విలన్ పాత్ర ఎంతో స్టైలిష్గా ఉండబోతుందని తెలిసింది.