Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వినాయకుడు తప్పు దిద్దుకున్నాడు కానీ పాపం...
విలేజీలో వినాయకుడు అంటూ హిట్టయిన వినాయకుడు చిత్రానికి సీక్వెల్ తెచ్చారు సాయికిరణ్ అడవి. అయితే ఈ లేటెస్ట్ చిత్రానికి అనుకున్నంతగా ఓపినింగ్స్ రాలేదు. దానికి కారణం కొద్దిరోజులకు ఐడింటిఫై చేసి తప్పు సరిదిద్దుకున్నారు. అది మరేదో కాదు..విలేజ్ లో అనేది ఇంగ్లీష్ లో పెట్టడమేనని. దాంతో తెలుగులో విలేజ్ లో అనేది రాసి మరోసారి పబ్లిసిటీ కాంపయిన్ ప్రారంభించారు. అయితే ఈసారీ స్పందన రాలేదు. దానికి కారణం..వెళ్ళిన కొద్ది మందీ బాగా స్లో నేరషన్ అనీ, మొదటి దానంత బాగోలేదని టాక్ తెచ్చారు. అలాగే రివ్యూలు సైతం గొప్పగా రాలేదు. దాంతో దర్శకుడు డైలమాలో పడ్డారు. చందమామ లాంటి కథ అన్నా చదవటానకి ఎవరూ రాకపోవటం నిరాశపరుస్తోంది. ఇక మరో ప్రక్క మంచి చిత్రాలు ప్రోత్సహించండి అంటూ ఓ సంస్ద వారు ఈ సీక్వెల్ ని భుజాన వేసుకున్నారు. అదీ పట్టించుకునే వారు కరువయ్యారు. అయినా మొదట్లోనో ఆ పోస్టర్స్ అందులో అదే చిరునవ్వుతో కృష్ణుడుని చూసిన వారు వినాయకుడు సెకెండ్ రిలీజ్ అని పొరపడ్డారు. సినీ పక్షులు తప్ప ఇది సీక్వెల్ అని గ్రహించిన వారు కరువయ్యారు. ఏదైమైనా మొదటి సినిమాకు పెద్ద ప్రమేషన్ లేదు..అయినా వర్కవుట్ అయింది..ఎందుకంటే కథ, కథనాలు బాగున్నాయి కాబట్టి అనేది మాత్రం నిజం. ఇది గ్రహిస్తే సాయి కిరణ్ అడవి మరో హిట్ సినిమా తీయటం కష్టమేమీ కాదు.