Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ట్రోలింగ్ ఎఫెక్ట్: ‘వినయ విధేయ రామ’ నుంచి ఆ సీన్లు లేపేస్తున్నారా?
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం భారీ అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. 'రంగస్థలం' లాంటి విజయం తర్వాత వస్తున్న సినిమా కావడం, బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని భావించిన అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా కథ పరంగా, సినిమాను తెరకెక్కించిన విధానం పరంగా దర్శకుడు విఫలం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సినిమాలోని సీన్లపై ట్రోలింగ్
అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. దర్శకుడు బోయపాటి కొన్ని సీన్లు మరీ ఓవర్గా ప్రజంట్ చేశారని, ముఖ్యంగా క్లైమాక్స్లో విలన్ వివేక్ ఒబెరాయ్ పాముతో ఓ పిల్లాడిని బెదిరించడం, ఆ పాము విలన్ను కాటేసి చివరకు అదే చచ్చిపోవడం లాంటి సీన్లు యాక్సెప్టబుల్గా లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సీన్లు లేపేస్తున్నారా?
ఈ పాము కాటు సీన్తో పాటు ట్రైన్ సీన్, మరికొన్నిఓవర్ లాజిక్ లెస్ సీన్లను తొలగించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని తొలగించడం ద్వారా ఎంతో కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట.
రామ్ చరణ్ కష్టం, భారీ బడ్జెట్
ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. భారీగా కండలు పెంచాడు. నిర్మాత డివివి దానయ్య కూడా వెనకముందు ఆలోచించకుండా భారీగా ఖర్చు పెట్టారు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో హై బడ్జెట్ మూవీ ఇదే. అఫ్ కోర్స్ దర్శకుడు బోయపాటి అంతకంటే ఎక్కువ కష్టపడ్డప్పటికీ ప్రేక్షకులను మెప్పించే ప్రొడక్ట్ అందించడంలో విఫలం అయ్యారు.
రామ్ చరణ్ మూవీ తీసేసి.. ఎఫ్ 2, పేటకు థియేటర్లు
‘వినయ విధేయ రామ' చిత్రానికి అంతగా ఆదరణ లేక పోవడంతో కొన్ని థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని లేపేసి... ఆ స్థానంలో ఎఫ్ 2, పేట చిత్రాలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2019 సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి దెబ్బ తగలడం మెగా అభిమానులను సైతం బాధిస్తోంది.