Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామను పట్టేశాడా?.. పంథా మార్చిన త్రివిక్రమ్
ప్రస్తుతం టాలీవుడ్లో అందరూ కూడా అప్డేట్లు ఇస్తూ బిజీబిజీగా ఉన్నారు. సెట్స్ మీదున్న ప్రతీ ప్రాజెక్ట్ ఏదో రకమైన అప్డేట్ ఇస్తూనే ఉంది. సినిమా టైటిల్, పోస్టర్, కాస్ట్ అండ్ క్రూ, రిలీజ్ డేట్స్ ఇలా ఏదో ఒక విషయాన్ని అప్డేట్ రూపంలో బయటకు వదులుతున్నారు. అందరూ రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ డేట్లను బుక్ చేసేసుకుంటున్నారు. దాదాపు అందరూ కూడా గ్యాప్లతోనే వస్తున్నారు. అయితే ఇలా అందరూ ఓ వైపు అప్డేట్లతో బిజీగా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ కాంబో మాత్రం మెల్లిగా పని కానిచ్చేస్తున్నారు.
క్రేజీ కాంబో..
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అంటే అందరికీ కొన్ని అంచనాలుంటాయి. అది కూడా అరవింద సమేత వంటి మాస్ అండ్ క్లాస్ హిట్ రావడంతో ఆ కాంబోకు ఉండే అంచనాలు పెరిగాయి. వెనువెంటనే ఇలా మరో ప్రాజెక్ట్ అనడం, అది కూడా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అనే సరికి అంచనాలు ఆకాశన్నంటాయి.
అలాంటి రూమర్లు..
ఎన్టీఆర్ 30వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్పై అనేక రూమర్లున్నాయి. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారని, రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా మరో వార్త బయటకు వచ్చింది.
ఆ హీరోయిన్ అంటూ...
మామూలుగా త్రివిక్రమ్ సినిమా అంటే కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక్కోసారి వీలుని బట్టి ముగ్గుర హీరోయిన్లు కూడా ఉంటారు. అయితే ఇందులో పూజా హెగ్డే, రష్మిక మందాన్నలను హీరోయిన్లుగా తీసుకుంటాడనే రూమర్లు ఎన్నో వచ్చాయి. దాంతో పాటు తాజాగా మరో వార్త పుట్టుకొచ్చింది.
పంథా మార్చి..
మామూలుగా త్రివిక్రమ బాలీవుడ్ భామలను తెలుగులోకి పట్టుకొచ్చేద్దామని ఎప్పుడూ చూడడు. కానీ ఈ సారి మాత్రం తన పంథాను మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ యంగ్ భామను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. లవ్ యాత్రి సినిమాతో ఫేమస్ అయిన వరీనా హుస్సేన్ను ఎన్టీఆర్ పక్కన నటించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట.
లుక్ టెస్ట్ కూడా..
ఈ క్రమంలోనే టెస్ట్ షూట్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్లో ల్యాండ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె నటన పట్ల త్రివిక్రమ్ సుముఖత వ్యక్తం చేశారని దీంతో ఆమెకు ఈ సినిమాలో ఓ పాత్రను ఇచ్చారని నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.