Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మా ఇద్దరి మద్య ఫ్రెండ్షిప్పే ఎఫైర్ లేదు: ఆరెంజ్ హీరోయిన్..!?
అయ్యో అదేం లేదు..రితేష్ ఎప్పటినుంచో నాకు మంచి స్నేహితుడు..అంతకన్నా మా మధ్య ఇంకేమీ లేదు." అంటూ తెగ కంగారు పడిపోతోంది ఆరెంజ్ హీరోయిన్ జెనీలియా. ఆరేడేళ్ళుగా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖకీ, హీరోయిన్ జెనీలియాకీ మధ్య ఎఫైర్ నడుస్తోంది. రాజకీయ కుటుంబం నుంచి సినిమాల్లోకొచ్చిన రితేష్ తో, జెనీలియా క్లోజ్ గా మూవ్ అవుతోందంటూ గతంలో విన్సించిన వార్తలెలా ఉన్నా, ఈ మద్య ఓ ఫంక్షన్ లో ఇద్దరూ తప్పతాగి చిందులేశారనీ, ఇద్దరి వ్యవహారం చూస్తోంటే, పెళ్లికి రెడీ అయినట్లున్నారంటూ బాలీవుడ్ లో తాజాగా గాసిప్స్ దర్శనమిస్తున్నాయి.
ఈ విషయాన్ని గ్రహించిన జెనీలియా తప్పనిసరి పరిస్థితుల్లో 'ఆ రిలేషన్ కేవలం స్నేహం మాత్రమే.."అంటూ మీడియా నుంచి తప్పించుకొంటోంది. అయితే రితేష్ మాత్రం, జెనీలియా తనకు మంచి స్నేహితురాలనీ, ఆమెకు గొప్ప వ్యక్తిత్వముందనీ..చెబుతూనే, ఇద్దరి మధ్యా ఒకప్పుడు ఎఫైర్ నడిచిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటున్నాడు. మిరి ఇప్పుడూ ఆ ఎఫైర్ నడుస్తోందా..?అనడిగితే, నో కామెంట్ అంటూ తప్పించుకుంటున్నాడు రితేష్ దేశ్ ముఖ్.