పవన్ కళ్యాణ్కి శ్రీహరికి మద్య గోడవకు కారణం ఏమై ఉంటుదబ్బా..?
పవన్ కళ్యాణ్ తన కధ కోట్టేశాడంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో కూర్చుని భోరున విలపించాడు. అతను ఏడుస్తుంటే ఆంధ్రజ్యోతి వారు కెమెరా జూమ్ చేసి మరీ చూపించడం జరిగింది. అలా జూమ్ చేయడానికి కారణం అతను నిజంగా ఏడ్చాడో లేక నటించాడో ప్రక్కన పెడితే తష్వామైదాన్ అనే కధతో పవన్ కళ్యాణ్ సినిమా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసి శ్రీహారి స్వయంగా శ్రీధర్ రెడ్డిని ఉసిగోల్పాడని సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాక్.
ఆకధని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తి రిజష్టర్ చేసుకోవడం వల్ల అది పవన్ కళ్యాణ్కే చెల్లుతుంది. అస్సలు కధ రిజష్టర్ అయిందో లేదో చూసుకోకుండా పవన్ కళ్యాణ్పై నేరం మోపిన శ్రీహరికి అది ఆలస్యంగా తెలిసింది. దాంతో కధ హాక్కులు తెచ్చుకోమని శ్రీధర్ రెడ్డిని అక్కడికి పంపించాడంట. దాంతో తాను ఇష్టపడినటుంటి కధను తీసుకోనిపోయి వేరే హీరోతో చేయాలని నిర్ణయించుకున్న శ్రీధర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అస్సలు పట్టించుకోలేదు.
దాంతో పవన్ కళ్యాణ్ పరువుని టీవీ ఛానల్స్ కి ఎక్కించమని తెరవెనుక నుంచి శ్రీహరి కధ నడిపించాడంట. టివి ఛానల్స్ లో శ్రీహరికి ఈసంగతి తెలియదని ఒకటికి పది సార్లు శ్రీధర్ రెడ్డి నోక్కి చెప్పడంతో అతనిని అస్సలు అక్కడికి పంపించిందెవరో అందిరికి తెలిసిపోయింది. తన వెనుక శ్రీహరి ఉన్నాడనే అండతోని శ్రీధర్ రెడ్డి రెచ్చిపోయి మరీ మీడియాకి ఎక్కాడని సమాచారం. దీనికి అంతటికి అసలు కారణం శ్రీహరియేనని అందరికి తెలిసిపోయింది. ఇది మాత్రమే కాకుండా చిరంజీవితో డైరెక్టుగా విభేదాలు శ్రీహరికి లేకపోయినప్పటికీ ఎప్పటినుండో చిరు వ్యతిరేక వర్గంతో శ్రీహరి సన్నహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











