Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'గుండమ్మ కథ'రీమేక్ దర్సకుడు?
రీసెంట్ గా ఇంటర్వూల్లో నాగచైతన్య మరోసారి గుండమ్మ కధ రీమేక్ విషయం ప్రస్తావించిన సంగతి తెలిసిందే.దాంతో మరో సారి ఈ వార్తను అనుసరిస్తూ మరిన్ని వార్తలు వినపడుతున్నాయి.ఇప్పుడు ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నాడంటూ వినపడుతోంది.అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రంలో గుండమ్మగా వాణిశ్రీని సెలెక్టు చేస్తే బావుంటుందని భావిస్తున్నారని చెప్తున్నారు.ఇక గుండమ్మ పాత్ర ఫైనల్ అయితే ఎన్టీఆర్ కూడా డేట్స్ కేటాయించటానికి రెడీగా ఉన్నాడు.
అయితే ఈ పాత్రలను ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్, ఎఎన్నార్ మనమడు నాగచైతన్య చేస్తామని ముందుకు వచ్చారు . ఇద్దరి పాత్రలు ఓకే. కానీ చిత్రంలో నటించడానికి గుండమ్మగా ఎవరు, ఎస్వీరంగారావు ధరించిన పాత్ర, రమణారెడ్డి పోషించిన గంటన్న పాత్రలు ఎవరు చేస్తారన్న చర్చ సహజంగానే జరుగుతోంది. ఈ కాలానికి తగినట్లు మార్పులతో కాజల్,తాప్సీ హీరోయిన్స్ గా ఈ పాజెక్టుని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు.ఇక కొందరు సినిమా వీరాభిమానులు మాత్రం ఈ సినిమా రీమేక్ ఆలోచన వదిలేస్తే మంచిదని సూచిస్తున్నారు.ఇంతకీ ఈ చిత్రం తెరకు ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి.