twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గుండమ్మ కథ'రీమేక్ దర్సకుడు?

    By Srikanya
    |

    రీసెంట్ గా ఇంటర్వూల్లో నాగచైతన్య మరోసారి గుండమ్మ కధ రీమేక్ విషయం ప్రస్తావించిన సంగతి తెలిసిందే.దాంతో మరో సారి ఈ వార్తను అనుసరిస్తూ మరిన్ని వార్తలు వినపడుతున్నాయి.ఇప్పుడు ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నాడంటూ వినపడుతోంది.అశ్వనీదత్ నిర్మించే ఈ చిత్రంలో గుండమ్మగా వాణిశ్రీని సెలెక్టు చేస్తే బావుంటుందని భావిస్తున్నారని చెప్తున్నారు.ఇక గుండమ్మ పాత్ర ఫైనల్ అయితే ఎన్టీఆర్ కూడా డేట్స్ కేటాయించటానికి రెడీగా ఉన్నాడు.

    అయితే ఈ పాత్రలను ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్, ఎఎన్నార్ మనమడు నాగచైతన్య చేస్తామని ముందుకు వచ్చారు . ఇద్దరి పాత్రలు ఓకే. కానీ చిత్రంలో నటించడానికి గుండమ్మగా ఎవరు, ఎస్వీరంగారావు ధరించిన పాత్ర, రమణారెడ్డి పోషించిన గంటన్న పాత్రలు ఎవరు చేస్తారన్న చర్చ సహజంగానే జరుగుతోంది. ఈ కాలానికి తగినట్లు మార్పులతో కాజల్,తాప్సీ హీరోయిన్స్ గా ఈ పాజెక్టుని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు.ఇక కొందరు సినిమా వీరాభిమానులు మాత్రం ఈ సినిమా రీమేక్ ఆలోచన వదిలేస్తే మంచిదని సూచిస్తున్నారు.ఇంతకీ ఈ చిత్రం తెరకు ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి.

    English summary
    Naga Chaitanya recently said that he is willing to remake the film provided he gets a good producer and heroine, and even hinted that Tarak had expressed some time back that he would like to be part of the Gundamma remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X