ప్రభాస్ చిత్రంలో చనిపోయేది ఎవరు........!?
డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలను పరిశీలిస్తే... ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం 'సంతోషం"లో గ్రేసిసింగ్ పాత్ర స్టోరీ మధ్యలో చనిపోతుంది.. ఇక ఆమె పాత్రను మొత్తం శ్రియ పాత్ర నడుపుతుంది. అలాగే ఇతగాడి దర్శకత్వంలో వచ్చిన 'స్వాగతం" చిత్రంలో అనుష్క, భూమిక ఇద్దరూ నటించారు. ఈ చిత్రంలో కూడా భూమిక పాత్ర సినిమా చివరలో చనిపోతుంది. కాగా ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్, తాప్సీ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దశరథ్ ఏ హీరోయిన్ని చంపేస్తాడో వేచి చూడాల్సిందే.
More from Filmibeat
ప్రభాస్ తాప్సీ కాజల్ అగర్వాల్ శ్రియ సంతోషం గ్రేసిసింగ్ అనుష్క భూమిక దిల్ రాజు ధశరథ్ prabhas tapsi kajal agarwal shriya santhosam greysi singh bhoomika dil raju dasaradh


Click it and Unblock the Notifications











