Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అల్లు అర్జున్,త్రివిక్రమ్ మధ్య విభేదాలు?
అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా వినపడుతున్న దాన్ని బట్టి ఈ చిత్రం ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.ఆస్ట్రైలియా నుంచి రాగానే వెంటనే అల్లు అర్జున్ ..దిల్ రాజు చిత్రం లో చేయనున్నాడని చెప్తున్నారు.దానికి కారణం కేవలం అల్లు అర్జున్ కి స్క్రిప్టు నచ్చకపోవటమేనని,అందులో చెప్పిన మార్పులు త్రివిక్రమ్ చేయలేదని అందుకే అల్లు అర్జున్ కాదనుకుంటున్నాడని వినపడుతోంది.మరో ప్రక్క దీన్ని ఆసరాగా తీసుకుని దిల్ రాజు తన ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.జోష్ వంటి మెగా ప్లాప్ ఇచ్చిన వాసు వర్మ దర్సకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.మరో ప్రక్క త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టి మరో హీరోని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.అంతేగాక అల్లు అర్జున్ తాను ఇలా భుజం ఆపరేషన్ నిమిత్తం ఆస్ట్రైలియా వెళ్లిన సంగతి కేవలం మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని త్రివిక్రమ్ బాధపడి తమ మద్య దూరం గుర్తించి వెంటనే వేరే హీరోని ఎప్రోచ్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.