Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఖలేజా, పులి ప్లాప్ అయినందుకే సూరి ఆ ప్లాట్ తీసుకున్నాడా?
కొమురం పులి, ఖలేజా చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ ప్లాట్ లో మద్దెల చెరవు సూరి ఉంటున్న సంగతి తెలిసింది. సూరి హత్య అనంతరం అతను సినిమా రంగంలో పెడుతున్న పెట్టుబడులు ఒక్కొక్తటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలో సూరి ఈ రెండు చిత్రాలుకు పెట్టుబడి పెట్టి ఆ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో ఆ డబ్బు రికవరి నిమిత్తం ఆ ప్లాట్ ని తీసుకున్నాడని, అంతేగానీ శింగనమల రమేష్ అతనికి అద్దెకు కానీ, ప్రీగా గానీ ఆ ప్లాట్ ని ఇవ్వలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రముఖంగా వినపడుతోంది. వీటితో పాటు అతను ఫైనాన్స్ చేసిన సినిమాలకు అతను ఇండైరక్ట్ గా ఇన్వాల్స్ అయ్యాడని, స్టార్స్ కి, టెక్నీషియన్స్ కు కూడా ఇది ఓపెన్ సీక్రెట్ అని అంటున్నారు. అయితే శింగనమల రమేష్ వీటిని ఖండిస్తున్నారు. తాను చెన్నైలో ఉండటం వల్ల తన ప్లాటు ఖాలీగా ఉంటోందని, తన స్నేహితులు పరిచయం చేసిన సూరికి దానిని ఇచ్చానని అంతవరకే అతనితో రిలేషన్ అని చెప్తున్నాడు. అలాగే..కొన్ని విషయాల్లో ఆయన సాయం చేసాడని మాత్రం చెప్పారు. ఏది నిజమో ఏది అబద్దమో చెప్పటానికి సూరి మన మధ్య లేడు. ఉన్నవారెవ్వరూ నిజాలు మాట్లాడి లేనిపోని తలనొప్పులు తెచ్చుకోరన్నది మాత్రం నిజం.