Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ ఎఫైర్ దాచటం కోసమే మీరా జాస్మిన్ మీడియాకు దూరం?
మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో మీడియా వారని కలవటం, ఇంటర్వూలు ఇవ్వటం కానీ చెయ్యటం లేదు. ఆమె సినిమాలు చేస్తున్న ప్రెస్ మీట్ ల్లో కూడా కనపడకుండా తప్పుకుంటోంది. ఎందుకిలా మీడియాని ఆమె దూరం పెడుతోంది అంటే...మీరా జాస్మిన్ కనపడగానే ఆమెకూ, మాండలిన్ శ్రీనివాస్ సోదరుడు రాజేష్ కు మధ్య జరుగుతున్న ఎఫైర్ గురించే మీడియా తరిచి తరిచి అడుగుతోంది. అప్పటికీ ఆమె ఓ సారి ప్రెస్ మీట్ లో ...రాజేష్ ప్రక్కనుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుందని, తన గతాన్ని మర్చిపోయి హాయిగా అనిపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమ వ్యవహారం ముదిరి పెళ్ళిదాకా వచ్చిందని, అందుకోసం ఇద్దరి ఇళ్ళలో గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. మరో ప్రక్క మీరా జాస్మిన్ నటించిన సినిమాలు వరసగా ప్లాఫ్ అవటం, ఆఫర్స్ తగ్గటం కూడా ఓ రకమైన డిప్రెషన్ స్టేట్ లో ఉంచి మీడియాను దూరంగా ఉంచేటట్లు చేస్తోందని వినికిడి. ఇక ప్రస్తుతం మీరా జాస్మిన్ తెలుగులో తాజాగా 'మోక్ష' అనే హర్రర్ చిత్రం చేస్తోంది. అందులో ఆమె వేంపైర్ గా కనిపించనుంది. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ చిత్రాన్ని శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.