Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ ఎఫైర్ దాచటం కోసమే మీరా జాస్మిన్ మీడియాకు దూరం?
మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో మీడియా వారని కలవటం, ఇంటర్వూలు ఇవ్వటం కానీ చెయ్యటం లేదు. ఆమె సినిమాలు చేస్తున్న ప్రెస్ మీట్ ల్లో కూడా కనపడకుండా తప్పుకుంటోంది. ఎందుకిలా మీడియాని ఆమె దూరం పెడుతోంది అంటే...మీరా జాస్మిన్ కనపడగానే ఆమెకూ, మాండలిన్ శ్రీనివాస్ సోదరుడు రాజేష్ కు మధ్య జరుగుతున్న ఎఫైర్ గురించే మీడియా తరిచి తరిచి అడుగుతోంది. అప్పటికీ ఆమె ఓ సారి ప్రెస్ మీట్ లో ...రాజేష్ ప్రక్కనుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుందని, తన గతాన్ని మర్చిపోయి హాయిగా అనిపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమ వ్యవహారం ముదిరి పెళ్ళిదాకా వచ్చిందని, అందుకోసం ఇద్దరి ఇళ్ళలో గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. మరో ప్రక్క మీరా జాస్మిన్ నటించిన సినిమాలు వరసగా ప్లాఫ్ అవటం, ఆఫర్స్ తగ్గటం కూడా ఓ రకమైన డిప్రెషన్ స్టేట్ లో ఉంచి మీడియాను దూరంగా ఉంచేటట్లు చేస్తోందని వినికిడి. ఇక ప్రస్తుతం మీరా జాస్మిన్ తెలుగులో తాజాగా 'మోక్ష' అనే హర్రర్ చిత్రం చేస్తోంది. అందులో ఆమె వేంపైర్ గా కనిపించనుంది. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ చిత్రాన్ని శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.