Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జూ.ఎన్టీఆర్ సైలెన్స్ వెనక సీక్రెట్
ఎప్పుడూ వార్తల్లో ఉంటూ సందడి చేసే ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యిపోయారు.ఆయన పబ్లిక్ గా కనిపించటం మానేసారు.ఆయన అజ్ఠాతవాసానికి కారణమేమిటనే చర్చ ఇప్పుడు మీడియా వర్గాల్లో మొదలైంది.నిజానికి 2010 లో ఎన్టీఆర్ పరిస్ధితి చాలా బాగుంది.అప్పుడు వచ్చిన అదుర్స్,బృందావనం చిత్రాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి.అయితే 2011 లో సీన్ రివర్స్ అయ్యింది.అయితే 2011 లో వచ్చిన శక్తి,ఊసరవెల్లి చిత్రాలు రెండూ డిజాస్టర్ అవటంతో ఆయన డైలమోలో పడ్డారు.దాంతో 2010 మ్యాజిక్ ని 2012 లో రిపీట్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు.అందుకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం ఉపకరిస్తుందని బావిస్తున్నారు.దాంతో పూర్తిగా ఆ చిత్రంపైనే దృష్టి పెడుతున్నారు.సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు.
తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.