Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ కి ప్రియమణి నో చెప్పిందా?
ప్రియమణి కి ఇప్పుడు చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవు.కానీ ఆమె ఆచి తూచి అడుగువెయ్యాలనుకుంటోంది.తాజాగా ఆమెను ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తారకరత్న కలిసి తనతో సినిమా చెయ్యమని అడగటం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.అయితే ఆమె సున్నితంగా తిరస్కరించిందని చెప్తున్నారు.ఆమె బాలకృష్ణతో మిత్రుడు,కళ్యాణ్ రామ్ తో హరేరామ్,ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలు చేయటంతో ఆమెతో చేయటంతో తనకూ లాభిస్తుందని భావించి అడగాడంటున్నారు.అయితే అసలే కెరీర్ లేక విలవిల్లాడుతున్న తాను తారకరత్న తో చేస్తే క్లైమాక్స్ కి వచ్చినట్లే అని భావిస్తోందిట.దాంతో తాను తమిళంలో బిజీగా ఉన్నానని,తెలుగులోనూ రెండు సినిమాలు టాక్స్ జరుగుతున్నాయని చెప్పి తప్పించుకుందిట.ఇక ప్రస్తుతం తారకరత్న నందీశ్వరుడు చిత్రంలో బిజీగా ఉన్నారు.కన్నడ చిత్రం డెడ్లీ సోమ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.ప్రియమణి మాత్రం క్షేత్రం చిత్రం విడుదల అయితే తన కెరీర్ కి ఏమన్నా కదలిక వస్తుందేమో అని ఎదురుచూస్తోంది.క్షేత్రం సినిమాలో ఆమె నాగ పెంచలమ్మ గా కనిపించనుంది.అందులో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రను చేస్తున్నారు.అలాంటి పరిస్దితుల్లో కూడా ప్రియమణి ..తారకరత్న కు నో చెప్పటం చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తే..మరికొందరు కెరీర్ పట్ల ఆమెకు ఉన్న ప్లానింగ్,జాగ్రత్త అలాంటివి అంటున్నారు.అదీ పాయింటేగా.