Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందుకా శృతి హాసన్ ని దిల్ రాజు తన సినిమాలోకి..
దిల్ రాజు, సిద్దార్ధ కాంబినేషన్ లో రూపొందనున్న ఓహ్ మై ప్రెండ్ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు" ఫ్లాప్ అయినా రిపీట్ చేయటమేమిటని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనికి కారణం కేవలం సిద్దార్ధ పట్టుదలే అని చెప్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు" చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటమే దానికి కారణం అని చెప్తున్నారు. అందుకనే తనతో ఎవరు చిత్రం తీయాలన్నా శృతినే తప్పక తీసుకోవాలని రికమెండ్ చేస్తున్నాడు.ఇక ఈ చిత్రానికి 'అలా.. మొదలైంది" హీరోయిన్ నిత్యామీనన్ను మొదటి తీసుకున్నాడు.అయితే సిద్ధార్థ్ రంగంలోకి దిగి నిత్యమీనన్ ను తప్పించి శృతి హాసన్నే హీరోయిన్గా బుక్ చేయించాడు. అయితే శృతి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపారేస్తూ.. అతను మా నాన్నకి, నాకు ఫాన్ అంతే అంతకు మించి ఏమీ లేదు అంటోంది.