Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పవన్ తర్వాతి సినిమా క్రిష్ తో? రాజకీయ మైలేజ్ కోసమేనా? :మిగతా ప్రాజెక్టుల సంగతేమిటి?
ఉన్నవి పూర్తి చేసి ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు కొత్త సినిమాలు పవన్ ఒప్పుకునే పరిస్థితిలేదు.
క్రిష్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్.. మణికర్ణికకు తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేయటానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. 'కంచె' సినిమా కంటే ముందుగానే పవన్తో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో క్రిష్ గట్టి ప్రయత్నాలే చేశాడు గానీ అవి ఫలించలేదు. ఇటు పవన్ కూడా రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వకముందే.ఇంకో సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు అదీ వచ్చే ఎన్నికల్లో తన ఇమేజ్ కి ప్లస్ అయ్యే సినిమా అయితే మంచిదనే అభిప్రాయం తో ఉన్నాడట.
Recommended Video
త్రివిక్రమ్ సినిమా షూటింగ్
అయితే ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమా లైన్లో ఉంది. మరోవైపు 2019 ఎన్నికల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తి సమయాన్ని పాలిటిక్స్పై పెట్టేందుకు ప్రణాళికలు రచించుకున్నారు.
రాజకీయంగానూ ఉపయోగపడుతుంది
వీలైనంత తొందరగా షెడ్యూల్ లో ఉన్న మూవీలను కంప్లీట్ చేసి రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టేందుకు కొత్త సినిమాలేవీ పవన్ ఒప్పుకునే పరిస్థితిలేదు. మరి క్రిష్ చెప్పిన కథ పవన్కు అటు రాజకీయంగానూ ఉపయోగపడుతుందని అందుకే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చంటూ వార్తలు వస్తున్నాయి.
సామాజిక అంశాలతో
సామాజిక అంశాలతో సందేశాత్మక సినిమాలను తెరకెక్కించే క్రిష్.. పవన్ కోసం అలాంటి కథనే సిద్ధం చేస్తున్నాడట. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి పీరియాడికల్ సినిమాలను రికార్డ్ టైమ్లో తెరకెక్కించిన క్రిష్.. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాను కూడా కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయనున్నాడట.
మణికర్ణిక
కంగన రనౌత్తో చేస్తోన్న 'మణికర్ణిక' మరో రెండు నెలల్లో పూర్తయిపోనుండడంతో.. ఆ తర్వాత పవన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. ఇక పవన్-క్రిష్ కాంబినేషన్లో రూపొందే సినిమాను.. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉందట. మొత్తంమీద.. త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ ఏ చిత్రం చేస్తాడు అనే సస్పెన్స్కు.. క్రిష్ సినిమా త్వరలోనే తెరదించుతుందేమో చూడాలి.