Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరీ అది ఓకే చేస్తేనే బాలకృష్ణ ప్రాజెక్టు స్టార్ట్?
పూరీ జగన్నాధ్ తను రాసుకున్న రెండు కథలను ఇప్పటికే బాలకృష్ణ కు చెప్పటం అవి రిజక్టు కావటం అనే సంగతులు తెలిసినవే. దాంతో బాలకృష్ణం ఈ విషయమై...పూరి జగన్నాథ్ కథ నచ్చకపోవడంతో నేను కాంప్రమైజ్ కానని ఆయనకు చెప్పేశాను. కథ ముఖ్యమండి. దాని తర్వాతే ఏదైనా.. పూరీ జగన్నాధ్ కథ ఓకే అయితే ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభించి, విజయదశమికి సినిమాని విడుదల చెయ్యాలనుకున్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందనే అంతా భావించారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.
ఢీ,అదుర్స్ వంటి అనేక చిత్రాలకు కథ అందించిన కోన వెంకట్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చిందట. ఆ కథతో పూరి జగన్నాద్ తో సినిమా చేద్దామని బాలయ్య నిర్ణయించుకుని నిర్మాత బెల్లంకొండతో చెప్పాడని సమాచారం. పూరి చేస్తానంటే వచ్చే నెల 7న ప్రారంభం చేద్దామని క్లియర్ గా చెప్పాడుట. కాని వేరే రచయిత కథతో సినిమా చేయటానికి పూరి మాత్రం సముఖంగా లేరని తెలుస్తోంది. ఇక పూరీ నిర్ణయం అని బాలయ్య ఈ విషయమై కలగచేసుకోవటానకి ఇష్టపడటం లేదు. మరి పూరీ తీసుకునే నిర్ణయంపై ఈ చిత్రం ప్రారంభం కానుందా లేదా అనేది ఆధారపడుతుందని చెప్పుకుంటున్నారు.