Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాహుబలి పార్ట్ 2లో ‘డబ్ల్యుడబ్ల్యుఇ’ స్టార్స్..?
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ ఈ చిత్రం దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో రిలీజైన ఈచిత్రం ఒక్క ఇండియాలోనే 500 కోట్లకుపైగా వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీసు వద్ద నెం.1 స్థానం సొంతం చేసుకుంది.
బాహుబలి పార్ట్ 1 ఎండింగులో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే? ప్రశ్న ఇపుడు భారతీయ సినీ ప్రేక్షకులను వేధిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికి బాహుబలి పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో కాలకేయుడి పాత్ర, ఆ పాత్ర కోసం సృష్టించిన కిలికి భాష ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో అనుష్క గ్లామరస్ రోల్ కూడా ‘బాహుబలి-2'పై అంచనాలు మరింత పెరిగేలా చేసాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి-2' మార్కెట్ పెంచేందుకు రాజమౌళి కొత్త ప్లాన్స్ వేస్తున్నారని, సినిమాలోకి వరల్డ్ ఫేమస్ డబ్ల్యు డబ్ల్యు ఇ స్పోర్ట్స్ స్టార్స్ను దించుతున్నట్లు తెలుస్తోంది. WWE ఛాపింయన్లయిన రెన్నా, బ్రూక్ లెస్సార్, సెయినా లాంటి వారితో సినిమాలో నటింపచేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ‘బాహుబలి' సెకండ్ పార్ట్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ చూసిన వారు రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. మిగిలిన 60 శాతం పూర్తి చేసి 2016లో సినిమాను విడుదల చేయనున్నారు.