Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐశ్వర్యారాయ్తో యశ్.. మరో లెవెల్కు వెళ్లే అవకాశం.. సెన్సేషనల్ దర్శకుడి ప్లాన్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అంటే కేవలం శాండిల్ వుడ్కు మాత్రమే పరిమితం కాదు. సౌత్ ఇండియా హద్దులు చెరిపేసి బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు సాధించే సత్తా గలవాడు. కేజీఎఫ్ లాంటి డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్లో కలెక్షన్ల సునామీని సృష్టించాడు. కేజీఎఫ్ సినిమా యశ్ స్టార్ డమ్ను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్తో బిజీగా ఉండగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
నవాబ్ తరువాత..
ఇండియన్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే ఓ ప్రత్యేక వర్గానికి విపరీతమైన పిచ్చి. ఆయన మేకింగ్ను ఇష్టపడని సినీ ప్రేక్షకులు ఉండరు. అయితే గత కొన్నేళ్లుగా మణిరత్నంకు సరైన సక్సెస్ రాలేదు. చివరగా నవాబ్ చిత్రంతో ఓ మోస్తరు విజయం వరించింది. దీంతో తన తదుపరి చిత్రాన్ని మరింత భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.
పొన్నియన్ సెల్వన్..
నవలా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ తారాగణం నటిస్తోంది. ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా లక్ష్మీ, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాల్ల, అదితి రావ్ హైదరీ, అశ్విన్, జయరామ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.
సీన్లోకి ఎంటరైన రాకీ భాయ్
పొన్నియన్ సెల్వన్ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్రకు యశ్ను తీసుకోవాలని మణిరత్నం భావించారట. అయితే ఇందుకోసం రంగంలోకి దిగిన సుహాసిని.. ఇద్దరికి మధ్య వర్తిత్వం వహించిందంటా. అయితే కథ విన్న యశ్.. నటించేందుకు అంగీకరించాడట.
Recommended Video
ఐశ్వర్యా రాయ్ బంధువుగా..
అయితే ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బంధువు, పాండ్య రాజుగా యశ్ కనిపించిబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి కేవలం ముప్పై రోజుల కాల్షీట్స్ మాత్రమే అది కూడా మే నెలలోనే ఇచ్చినట్టు టాక్. కానీ కరోనా వైరస్ వచ్చి పడటంతో అన్నింటికి బ్రేక్ పడింది. లేదంటే ఈ పాటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేది. యశ్ ఎంట్రీతో ఈ మూవీ మరో లెవెల్కు వెళ్తుందని టాక్.