Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'కెమెరామన్ గంగతో రాంబాబు' లో విలన్ చంద్రబాబు?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' నిన్న(గురువారం) భారీ ఎత్తున అభిమానులను ఆనందం కలగచేస్తూ విడుదల అయిన సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పొలిటికల్ సెటైర్ గా సాగింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన విలన్ పాత్ర చంద్రబాబు నాయుడుని పోలి ఉందని అంతటా వినిపిస్తోంది. ఆ పాత్ర పేరు రానా బాబు దీన్ని తిరగేస్తే నారా బాబు అని వస్తుందని కావాలనే ఈ పేరు పెట్టారని వినిపిస్తోంది. అలాగే ...ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర కోట శ్రీనివాస రావు చేసారు. ఆ పాత్ర రెండు సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రస్తుతం మాజీ సీఎం పాత్ర. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర ఓ సారి మాకు టెన్షన్ లతోనే బొల్లి,సుగర్,బీపీ వంటివి వస్తాయి అంటుంది. ఇవన్నీ చంద్రబాబుని ఉద్దేశించే అంటున్నారు.
ఇక మరో పాత్ర మంచి ముఖ్యమంత్రి పాత్ర. ఆ పాత్రను నాజర్ పోషించారు. ఆ పాత్ర..పేరు చంద్ర శేఖర్ రెడ్డి. తనకు వైయస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఆ పాత్రను తీర్చి దిద్దాడంటున్నారు. ఆ పాత్ర వైయస్ లా పంచుకట్టుతో ఉంటూ పాద యాత్ర చేసి అధికారంలోకి వచ్చి ఉంటుంది. అలాగే రాష్ట్లంలో ఏ మూల ఏముందో,ఎవరి కష్టాలు ఏమిటో తనకు పాదయాత్ర ద్వారా తెలిసాయంటుంటుంది. మరో ప్రక్క తెలంగాణా ఉద్యమాన్ని కూడా అన్యాపదేశంగా సెటైర్స్ వేసారనే వాదన కూడా వినిపిస్తోంది.
'గబ్బర్సింగ్' తర్వాత కల్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు హెవీగా ఉన్నాయి. ఆ అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉంటుందని హామీ ఇచ్చి మరీ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని బరిలోకి దించారు. అలాగే కల్యాణ్కీ, నాకూ 'కెమెరామన్ గంగతో రాంబాబు' కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్తున్నారు.
కథ చూస్తే... ఓ మామూలు కారు మెకానిక్ నుంచి చానల్ రిపోర్టర్గా మారిన రాంబాబు కథ. అందరూ చదివి వదిలేసే వార్తల్ని రాంబాబు సీరియస్గా తీసుకుని, వాటికి రియాక్ట్ అవుతుంటాడు. గంగ అనే కెమెరా(ఉ)మన్ వల్ల చానల్ రిపోర్టర్ అవుతాడు. ఒక రాజకీయ నాయకునికీ, అతనికీ మధ్య జరిగే గొడవ ఈ సినిమా. మీడియాని వాడుకుని ఆ రాజకీయ నాయకుడు ఎదగాలనుకుంటే, అదే మీడియాని వాడుకొని రాంబాబు అతన్ని ఎలా అడ్డుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్.