Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరంజీవి మేనల్లుడుతో సైలెంట్ గా వైవియస్ చౌదరి?
చిరంజీవి మేనల్లుడు(చెల్లెలు కుమారుడు)విశ్వతేజ తో అప్పట్లో దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే అది స్క్రిప్టు దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని వైవియస్ చౌదరి దర్శకత్వంలో సైలెంట్ గా ఓ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. సలీం డిజాస్టర్ తో బొక్కబోర్లా పడ్డ వైవియస్...కొత్త హీరోలను పరిచయం చేయటంలో నైపుణ్యత ఉందని ఈ అవకాశం ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకుముందు వైవియస్...రామ్ ని పరిచయం చేస్తూ దేవదాస్, వెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ సీతారాముల కళ్యాణం చూతుము రారండి చిత్రాలు రూపొందించారు. ఆ రెండు విజయం సాధించాయి.ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ చిత్రానికి వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక వైవియస్ చౌదరి కూడా నిర్మాతగా ఈ చిత్రంలో పాలు పంచుకునేలా ఎగ్రిమెంట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంభందించి కేవలం మాటలే జరిగాయని, ఇంకా పూర్తి స్ధాయి కన్ఫర్మేషన్ లేదని వినపడుతోంది.
ఇక ఇంతకు ముందు విశ్వతేజ హీరోగా, మధుశాలిని, రమ్య హీరోయిన్లుగా హ్యాపీజర్నీ పేరుతో ఓ చిత్రం ప్రారంభమైంది. పందెం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సభాపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటరమణారెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్ర కథ ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సుఖసంతోషాలను అనుభవంచాలని జీవితంలో పూర్తిగా మునిగిపోయి మానవసంభంధాలను విస్మరిస్తారని...దాన్ని వెలికి చెప్పటమే తమ లక్ష్యమంటున్నారు అప్పట్లో దర్శక, నిర్మాతలు తెగ ఊదరకొట్టారు. అయితే ఈ చిత్రం సెంటిమెంటు ఏమైందో ఆ తర్వాత ఎవరికీ తెలియలేదు. ఇక చిరంజీవి మరో మేనల్లుడు అల్లు అర్జున్ తెలుగునాట కంటిన్యూగా తన హవా కొనసాగిస్తున్నారు.