Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ సినిమాలో మరో యంగ్ హీరో: అల్లు అర్జున్, పవన్ తర్వాత ఉస్తాద్తో ఫైటింగ్
ఈ మధ్య కాలంలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ జోష్లోనే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నటించే నటీనటుల గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ సినిమాలో నటించే విలన్ను పరిచయం చేసింది చిత్ర యూనిట్.
రామ్ పోతినేని - లింగుసామీ కాంబినేషన్లో రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కోలీవుడ్ హీరో మాధవన్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ హీరో రామ్ కూడా ట్వీట్ చేశాడు. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఆది.. అల్లు అర్జున్ 'సరైనోడు', పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అని కూడా అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. నదియా కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి 'ఉస్తాద్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.