Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీటిమార్ ఎఫెక్ట్.. ఏడేళ్ల తరువాత విడుదలవుతున్న మరో సినిమా
యాక్షన్ హీరో గోపీచంద్ ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను అందుకునేవి. అయితే గతకొంత కాలంగా ఎదురవుతున్న అపజయాలు గోపీచంద్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇక మొత్తానికి అతను చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా మొదటిరోజు టాక్ తోనే క్లారిటీగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది. మొత్తానికి ఈ సినిమా అనంతరం గోపీచంద్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడు. వీలైనంతవరకు మంచి కథను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. గోపీచంద్ సీటీమార్ సినిమా కంటే ముందు వరుసగా నాలుగు అపజయాలను చూశాడు.
సంపత్ నంది దర్శకత్వంలో ఇదివరకే గోపి గౌతమ్ నంద సినిమా చేశాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఎందుకో అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక ఆ తర్వాత చేసిన పంతం చాణక్య సినిమాలు కూడా తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయి. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ తో ఫామ్ లోకి రావాలని ఎప్పటి నుంచో ఎదురచూస్తున్నాడు. మొదటి రోజే సీటిమార్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఇక రెండవ రోజు కూడా అదే దూకుడుగా వెళుతున్న గోపీచంద్ ఆదివారం కూడా భారీ స్థాయిలో లాభాలను అందుకునే అవకాశం ఉంది.
అయితే గోపీచంద్ ఫామ్ లోకి రావడంతో మరో సినిమాను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఏడేళ్ల క్రితం రావలసిన ఆరడుగుల బుల్లెట్ సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. మధ్యలో ఫైనాన్షియల్ కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న సినిమా చివరికి ఓటీటీలో అయినా విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ సమస్యలు ఓ కొలిక్కి రాలేదు. ఇంకా ఫైనల్ గా గోపిచంద్ ఒక ట్రాక్ లోకి రావడంతో అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకే ఇలాంటి పోస్టర్లను చాలా విడుదల చేసిన నిర్మాతలు సరైన పద్ధతిలో విడుదల చేయలేదు. కానీ ఈసారి మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు గోపిచంద్ నమ్మకంతో ఉన్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు ఎలాగైనా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలి అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏ సినిమా కూడా అతనికి కలిసి రాలేదు. సిటీ మార్ సినిమాతో ఒక ట్రాక్ లోకి రావడంతో ఆరడుగుల బుల్లెట్ సినిమా ను కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.