Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విషాదంలో హీరో ధనుష్.. సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్
సినీ తారలకు అభిమానులే కొండంత బలం. వారి అండదండలే పంచప్రాణాలు. అలాంటి అభిమానులకు ఇబ్బంది ఏర్పడితే సినీ తారలు భావోద్వేగానికి లోనవ్వడం సహజం. అలాంటి సంఘటననే తమిళ సూపర్ స్టార్ ధనుష్కు ఎదురైంది. ఈ సందర్భంగా ధనుష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ..
ధనుష్ అభిమాని మృతి
ధనుష్ అంటే ఈరోడ్కు చెందిన దినేష్ కుమార్కు చెప్పలేనంత అభిమానం. ఈరోడ్ జిల్లా ధనుష్ వెల్ఫేర్ అసోసియేషన్కు సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. అయితే దినేష్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాంతో ధనుష్ మనో వేధనకు గురయ్యారు.
తన అభిమాని గురించి సోషల్ మీడియాలో
అభిమాని దినేష్ కుమార్ మరణ వార్త తెలిసిన వెంటనే విషాదానికి గురైన ధనుష్ తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. దినేష్ మరణ వార్తతో విషాదంలో మునిగిపోయాను. ఈరోడ్లో నా పేరు నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే అసోసియేషన్కు సేవలందిస్తున్నారు. నా అభిమాని మృతి విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అంటూ ట్విట్ చేశారు.
కుటుంబ సభ్యులకు పరామర్శ
అంతేకాకుండా ఈరోడ్కు చెందిన అభిమానులను సంప్రదించి దినేష్ కుమార్ అంత్యక్రియల వ్యవహారాలను పర్యవేక్షించమని కోరినట్టు తెలిసింది. ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించినట్టు తెలిసింది. తన అభిమాని మృతితో విషాదానికి గురైన ధనుష్ తన కుటుంబాన్ని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిసింది.
బాలీవుడ్ చిత్రంలో ధనుష్
ఇక ధనుష్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అత్రరంగీ రే అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. పటాస్ మూవీ తర్వాత తమిళంలో కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించే జగమే తంత్రం చిత్రంలో నటించనున్నారు. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్పై రూపొందే ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.