Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఐదేళ్ల కొడుకు బైక్ పై గోపిచంద్.. హీరోగారి అల్లరి మామూలుగా లేదు.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపిచంద్. గోపిచంద్ స్క్రీన్ పై ఎంత హీరోయిజం చూపించినా కూడా బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయం ఏమిటంటే.. గోపిచంద్ ఒక ఫ్యామిలీ మ్యాన్ అని. ఇక ఫాథర్స్ డే సందర్భంగా గోపిచంద్ తన కొడుకులతో అల్లరిగా ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు.
హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి..
స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి హీరో గోపిచంద్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట హీరోగా సక్సెస్ కాకపోవడంతో విలన్ వేషాలు వేసుకుంటూ ముందుగా ఒక నటుడిగా తనకంటూ స్పెషల్ క్రేజ్ అందుకున్నాడు. అనంతరం తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.
కొడుకులతో అల్లరిగా..
నేడు ఫాథర్స్ డే కావడంతో తన ఇద్దరు కొడుకులతో దిగిన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. అందులో గోపిచంద్ తన కొడుకులతో అల్లరిగా ఆడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తన కొడుకు టాయ్ బైక్ పై ఎక్కి కూర్చున్నాడు. పక్కనే చిన్న కొడుకు కారులో సింగిల్ గానే కూర్చొని ఫోటోకి పొజిచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీరే నా బలం..
ఇక మరో ఫొటోలో గోపిచంద్ తన కొడుకులిద్దరిని పైన పడుకోబెట్టుకొని స్టిల్స్ ఇచ్చిన తీరు నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ముగ్గురు కూడా ఒకే తరహా డ్రెస్సులతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. నాన్నగా ఉండడం బెస్ట్ ఫీలింగ్ అంటూ.. నా పిల్లలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరే నా బలం అంటూ గోపిచంద్ ఫాథర్స్ డే సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు.
Recommended Video
ఆ సినిమాలో కబడ్డీ కోచ్..
ఇక గోపిచంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. గౌతమ్ నంద దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో గోపిచంద్ ఆంద్ర ప్రదేశ్ ఉమేన్స్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించబోతోంది.