Don't Miss!
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- News ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నువ్వు శాసించాలి, మేము పాటించాలి.. చిరంజీవిపై యంగ్ హీరో కామెంట్స్
కరోనా క్రైసిస్ ఛారిటీ అనే కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేసి శ్రీకారం చుట్టాడు. 21 రోజుల లాక్ డౌన్లో పనులు లేక ఇబ్బంది పడే సినీ కార్మికులకు అండగా నిలబడేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతోంది. సినీ శ్రామికులను ఆదుకోవాలని, అందుకోసం మొదటగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.
మిగతా వారంతా తమకు తోచిన సాయాన్ని చేయాలని చిరంజీవి కోరాడు. చిరు పిలుపివ్వడం ఆలస్యం... కుప్పలు తెప్పలుగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఈ విరాళాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, నాగార్జున కోటి, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగ చైతన్య 25 లక్షలు, వరుణ్ తేజ్ 20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, రవితేజ 20 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు ప్రకటించారు.
తాజాగా యంగ్ హీరో కార్తికేయ రెండు లక్షల రూపాయలను ప్రకటించాడు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. విరాళాలు వస్తూనే ఉన్నాయంటూ సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, కార్తికేయ రెండు లక్షలు ఇచ్చాడని పేర్కొన్నాడు. ఈ ట్వీట్కు స్పందించిన కార్తికేయ.. ఇలా ఎంకరేజ్ చేయండి బాస్.. ఏది చేయడానికైనా మేమంతా రెడీగా ఉంటాము.. నువ్వు శాసించాల.. మేము పాటించాల అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.