Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నువ్వు శాసించాలి, మేము పాటించాలి.. చిరంజీవిపై యంగ్ హీరో కామెంట్స్
కరోనా క్రైసిస్ ఛారిటీ అనే కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేసి శ్రీకారం చుట్టాడు. 21 రోజుల లాక్ డౌన్లో పనులు లేక ఇబ్బంది పడే సినీ కార్మికులకు అండగా నిలబడేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతోంది. సినీ శ్రామికులను ఆదుకోవాలని, అందుకోసం మొదటగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.
మిగతా వారంతా తమకు తోచిన సాయాన్ని చేయాలని చిరంజీవి కోరాడు. చిరు పిలుపివ్వడం ఆలస్యం... కుప్పలు తెప్పలుగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఈ విరాళాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, నాగార్జున కోటి, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగ చైతన్య 25 లక్షలు, వరుణ్ తేజ్ 20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, రవితేజ 20 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు ప్రకటించారు.
తాజాగా యంగ్ హీరో కార్తికేయ రెండు లక్షల రూపాయలను ప్రకటించాడు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. విరాళాలు వస్తూనే ఉన్నాయంటూ సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, కార్తికేయ రెండు లక్షలు ఇచ్చాడని పేర్కొన్నాడు. ఈ ట్వీట్కు స్పందించిన కార్తికేయ.. ఇలా ఎంకరేజ్ చేయండి బాస్.. ఏది చేయడానికైనా మేమంతా రెడీగా ఉంటాము.. నువ్వు శాసించాల.. మేము పాటించాల అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.