Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డార్లింగ్.. అన్యాయం చేసి వెళ్లిపోయావు.. భోరుమని ఏడ్చిన రాజేంద్ర ప్రసాద్
రవి అస్తమించని సంగీత సామ్రాజ్యంలో తెలుగు పాటకు గొప్ప గౌరవం, తరతరాల గాయకులకు స్పూర్తిగా నిలిచిన దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరనే వార్త గుండెలు పగిలేలా చేసింది. మన మాటగా, పాటగా ఎన్నో ఏళ్లుగా మనతో జీవిత ప్రయాణం చేసిన బాలు మరణవార్తతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ దు:ఖంలో మునిగిపోయారు. బాలు లేరన్న విషయంతో కలత చెందిన రాజేంద్ర ప్రసాద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ రోదిస్తూ..
లేడిస్ టైలర్ సినిమా తర్వాత
నా
డార్లింగ్
ఎస్పీ
బాలసుబ్రమణ్యం.
లేడీస్
టైలర్
సినిమాలో
ఇళయరాజా
సంగీత
దర్శకత్వంలో
తొలిసారి
నాకు
పాటపడిన
తర్వాత
నాకు
ఫోన్
చేసి..
పిలిచి
డార్లింగ్..
ఐ
లవ్
యూ
అన్నావు.
ఆ
తర్వాత
వందల
పాటలు
పాడారు.
అలాంటి
మీరు..
ఇలా
అన్యాయం
చేస్తావా
డార్లింగ్..
ఘంటసాల
గారే
తొందరగా
వెళ్లిపోయి
గంధర్వుడిగా
మారారు.
మీరు
కూడా
గంధర్వుల్లో
కలిసిపోయారా?
ఇది
చాలా
అన్యాయం
అంటూ
నటుడు
డాక్టర్
రాజేంద్ర
ప్రసాద్
ఆవేదన
వ్యక్తం
చేశారు.
వంద రకాల పాటలు.. వంద రకాలుగా
మీ
కెరీర్లో
ఎంతో
మంది
హీరోలకు
పాటలు
పాడారు.
కానీ
హీరో
రాజేంద్రప్రసాద్కు
వందల
పాటలు
పాడారు.
వందల
రకాల
పాటలు
పాడారు.
ఉదాహరణకు
మనిషి
జీవితంలో
పెళ్లి,
చావు
ప్రధానం.
పెళ్లికి
సంబంధించి
పెళ్లిపుస్తకం
చిత్రంలో
శ్రీరస్తు,
శుభమస్తు
అంటూ
పాట
పాడారు.
ఎవరైనా
పెళ్లి
చేసుకొంటే
ఆ
పాటను
పెట్టుకోవాల్సిందే.
అలాగే
ఓ
మనిషి
వెళ్లిపోతే
ఒక్కడే
పుట్టడం..ఒక్కడే
పోవడం..
మధ్యలో
ఈ
నాటకం
విధిరాత
అంటూ
ఆ
నలుగురు
చిత్రంలో
పాటపాడి
నా
జీవితానికి,
కెరీర్కు
అర్థం
కల్పించారు
అని
భావోద్వేగానికి
గురయ్యారు.
అన్యాయం చేసి ఎలా వెళ్లిపోతావు
ఎన్నో
గొప్ప
పాటలు
పాడి
మాతో
విడదీయలేని
బంధాన్ని
వేసుకొని
ఎలా
వెళ్లిపోతారు.
ఇది
చాలా
అన్యాయం.
నాతోపాటు
జంధ్యాల,
బాపు,
జయకృష్ణ,
కమల్
హాసన్గారితో
మన
అనుబంధం
మాటల్లో
చెప్పలేను.
మీరు
పాటలను
గుర్తు
చేసుకొంటూ
పోతే
నా
జీవిత
చివరి
అంకం
వస్తుంది
అని
రాజేంద్ర
ప్రసాద్
పొంగుకొస్తున్న
దు:ఖాన్ని
ఆపుకొంటూ
మాట్లాడారు.
Recommended Video
డార్లింగ్.. దిస్ ఈజ్ నాట్ గుడ్ ..
మీతో ఉన్న అనుబంధం, మీతో గడిపిన క్షణాలు ఎలా మరిచిపోవాలి. డార్లింగ్ మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ప్లీజ్ దిస్ ఈజ్ నాట్ గుడ్.. దిస్ ఈజ్ నాట్ గుడ్.. మీరు నన్ను వదిలి వెళ్లడం న్యాయం కాదు అంటూ రాజేంద్ర ప్రసాద్ భోరున విలపించారు. రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ఆ వీడియో నెటిజన్లను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నది.