twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాడ్ టాక్ వస్తే సినిమా పోతుందనే భయం, ఆ ఆఫీస్ బాయ్ వల్లే: అడవి శేష్

    |

    అడవి శేష్, రెజీనా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎవరు'. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడివి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    సాధారణంగా ఇంతకు ముందు మనం ప్రీమియర్స్ వేయడం ఎందుకు ఆపేశారంటే ఒక సినిమా బాగోలేకపోతే.. దాని బ్యాడ్ టాక్ బయటకు వెళ్లి సినిమా బిజినెస్ అవకాశాలను కిల్ చేస్తుందనే భయంతో అలా చేసేవారు. అలా చేయడం ద్వారా మనం ఏ సినిమా అయితే ప్రపంచానికి చూపిద్దామనుకుంటున్నామో దాన్నే దాచిపెట్టుకుంటున్నాం.... కానీ 'ఎవరు' విషయంలో మాకు ఆ భయం లేదని అడ విశేష్ తెలిపారు.

    వెయ్యి మందికి సినిమా చూపించాం

    వెయ్యి మందికి సినిమా చూపించాం

    ఈ సినిమాను మేము ఒక వెయ్యిమంది నాన్ ఇండస్ట్రీ మనుషులకు చూపించాం. క్యాజువల్ ఐటీ క్రౌడ్, కాలేజ్ క్రౌడ్, నలుగురు వాచ్ మెన్, వారి ఫ్యామిలీ ఇలా సినీ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులకు సినిమా చూపించాం. ముఖ్యంగా వారు సినిమా చూస్తున్నపుడు కానీ, చూసిన తర్వాత కానీ నేను, డైరెక్టర్ ఆ దగ్గరలో ఉండేవారం కాదు. అసిస్టెంట్లను బయట నిల్చొపెట్టి వారికి ఒక కండీషన్ పెట్టేవాడిని, ‘‘భయ్యా సినిమా బావుందా?'' అని అడగొద్దు, క్యాజువల్ గా నిల్చొండి, సినిమా బావుంటే వారే వచ్చి మీతో మాట్లాడతారు అని చెప్పాను. లక్కీగా సినిమాను రిఫైన్ చేసేకొద్దీ ఆ ఫోకస్ గ్రూఫ్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి సినిమాను ఇంకా బెటర్ చేశామని... అడవి శేష్ తెలిపారు.

    నచ్చకపోతే ప్రశ్నలు వేస్తారు

    నచ్చకపోతే ప్రశ్నలు వేస్తారు

    ఒక మూమెంట్లో మాట్లాడటానికి ఏమీ లేకుండా వారే వచ్చి భయ్యా ఇది నచ్చింది, అది నచ్చింది అని చెప్పడం మొదలు పెట్టారు. మన కల్చర్లో మన సంస్కారం ఏమిటంటే మనకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదు అనలేక ప్రశ్నలు అడుగుతాం. హీరో అలా ఎందుకు చేశాడు? ఇది ఇలా ఉంటుందా? అని అడుగుతాం. ఈ సినిమా చూసిన తరువాత జనాలు ప్రశ్నలు అడగటం మానేశారు. అంటే వారికి సినిమా నచ్చచిందని అర్థం... మా సినిమా విషయంలో ఇలాంటి ఫీడ్ బ్యాక్ నాకు చాలా సంతోషంగా ఉందని అడవి శేష్ తెలిపారు.

    ఆ ఆఫీస్ బాయ్‌కే ఈ సినిమా అంకితం

    ఆ ఆఫీస్ బాయ్‌కే ఈ సినిమా అంకితం

    ‘క్షణం' సినిమా చేస్తున్నపుడు అక్కడ పని చేస్తున్న ఆఫీస్ బాయ్ తన ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను అతడి వెనకాల ఉన్న విషయం తెలియదు. ఫోన్లో ‘ఏముందిరా ఏదో చిన్న సినిమా... ఊపిరి వచ్చేదాకా ఏదో ప్లేస్ హోల్డర్' అని ఎవరికో చెబుతున్నాడు. అతడి మాటను మోటివేషన్‌గా పెట్టుకుని ప్రతిసారి ఆ కుర్రాడిని డిస్ ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. కష్టపడి ముందుకు వెళుతున్నాను. ‘ఎవరు' చిత్రాన్ని ఆ ఆఫీస్ బాయ్‌కే డెడికేట్ చేస్తున్నాను.... అని అడవిశేష్ చెప్పుకొచ్చారు.

    ఎవరు

    ఎవరు

    ఎవ‌రు, బ‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌.

    English summary
    Adivi Sesh Superb at Evaru Movie Pre Release Press Meet. Evaru 2019 latest Telugu movie ft. Adivi Sesh, Regina Cassandra, Naveen Chandra and Murali Sharma. Directed by Venkat Ramji. Music by Sricharan Pakala. Produced by Pearl V. Potluri, Param V. Potluri and Kavin Anne under PVP Cinema banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X