Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అడివి శేష్ కు కరోనా.. ఆ సినిమాలు చూడమంటూ ట్వీట్!
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమాతో ఇటీవలే అడవి శేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి మరిన్ని వసూళ్లు సాధిస్తూ భారీ లాభాలను సాధించి హాట్ టాపిక్ గా మారింది. మేజర్ సినిమాతో హిట్ కొట్టిన అడవి శేష్ తాజాగా తాను కరోనా బారిన పడ్డానని చెబుతూ కొన్ని సినిమాలు చూడమని సజెస్ట్ చేశాడు. నిజానికి ఎలా అయినా హీరో అవ్వాలనే ఉద్దేశంతో అమెరికాలో చదువు పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చి నటుడు అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు అడివి శేష్.
అందులో భాగంగా ఆయన ముందుగా పంజా లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. అయినా సరే ఏ మాత్రం నిరాశ చెందకుండా క్షణం అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే హీరోగా క్షణం సినిమాతో పేరు తెచ్చుకున్న అడవి శేషు ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam
— Adivi Sesh (@AdiviSesh) August 5, 2022
Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳
అందులో భాగంగా అడివి శేష్ గూడచారి, ఎవరు వంటి సినిమాలతో హిట్ కొట్టి ఎప్పటి నుంచో తన మదిలో ఉన్న ఒక సబ్జెక్ట్ ను పట్టాలు ఎక్కించారు. ముంబై ఉగ్రవాద దాడుల్లో మరణించిన కేరళకు సంబంధించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఆయన ఒక సినిమా తెరకెక్కించాలని అనుకుని, ఆ ఐడియాను మహేష్ బాబు ముందుకు తీసుకు వెళ్ళగా ఆయన నిర్మించేందుకు ఒప్పుకోవడంతో సినిమా నిర్మాణం ప్రారంభమైంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
నిజానికి అడివి శేష్ మేజర్ సినిమా తరువాత వెంటనే హిట్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా సోకడంతో ఐసొలేషన్లో ఉన్నారట, ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో ఈ రోజు రిలీజ్ అయిన రెండు పెద్ద సినిమాలు బింబిసార, సీతారామం చిత్రాలను చూడమని తన అభిమానులకు సలహా ఇచ్చారు. "బింబిసార, సీతారమం.. ఈ రెండింటికీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. వెంటనే ఈ రెండు సినిమాలను మార్నింగ్ షో ఒకటి, మ్యాట్నీ ఒకటి నా కోసం చూసేయ్యండి అని ఆయన కోరారు. కరోనా వల్ల థియేటర్లకు వెళ్లలేకపోతున్నానని తన స్నేహితులు నటించిన మూవీని తప్పకుండా చూడాలని ఆయన్ కోరారు.