Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఢీ కాంబినేషన్.. ప్రకటించిన మంచు విష్ణు!
మంచు విష్ణు, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఢీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. శ్రీనువైట్ల మార్క్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్ గా నిలించింది. అప్పట్లో వరుస విజయాలతో శ్రీనువైట్ల మంచి జోరుమీద ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శ్రీనువైట్ల వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. శ్రీనువైట్ల చివరగా తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
దీనితో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా 12 ఏళ్ల తర్వాత ఢీ కాంబినేషన్ సెట్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండవసారి నటించబోతున్నట్లు మంచు విష్ణు స్వయంగా ప్రకటించాడు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంచు విష్ణు ఈ ప్రకటన చేశాడు. రెడీ, ఢీ, వెంకీ లాంటి విజయాలతో శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. తన చిత్రాల్లో శ్రీనువైట్ల హాస్యానికి పెద్ద పీట వేసేవారు. ఆ ఫార్ములా బాగా వర్కౌట్ అయ్యేది.
దూకుడు చిత్రం తర్వాత శ్రీనువైట్ల స్థాయి మరింతగా పెరిగింది. కానీ ఆగడు చిత్రం నుంచి శ్రీనువైట్ల ప్లాపుల పరంపర మొదలయింది. పరాజయాల నుంచి బయట పడడానికి శ్రీనువైట్ల ప్రయత్నిస్తున్నారు. ఇక మంచు విష్ణుకి కూడా ఇటీవల సరైన సక్సెస్ లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.