Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐదేళ్ల తర్వాత ఆ పని చేస్తున్న హీరో సిద్దార్థ్!
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'నిను వీడని నీడని నేనే'. హర్రర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ ఈ చిత్రానికి నిర్మాత కూడా. సందీప్ కిషన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇది. హర్రర్ తో పాటు ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింద.
హీరో సిద్దార్థ్ స్వతహాగా మంచి సింగర్ కూడా. సిద్దార్థ్ గతంలో బొమ్మరిల్లు, ఓయ్, ఓ మై ఫ్రెండ్ లాంటి చిత్రాలకు పాటలు పాడాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత సందీప్ కిషన్ కోసం మళ్లీ సింగర్ గా మారాడు. నిను వీడని నీడని నేనే చిత్రంలో సిద్దార్థ్ ఓ పాట పాడాడట. సోమవారం రోజే ఆ పాటని చెన్నైలో రికార్డ్ చేశారు. అన్యా సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
మాటలు బాగా చెప్పారు, ఇదీ మీ బుద్ది.. అభినందన్ని విడిచిపెట్టాలి అంటూ హీరో రామ్, సిద్దార్థ్!
సిద్దార్థ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు సందీప్ కిషన్ మహా శివరాత్రి సందర్భంగా ప్రకటించాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వేంకటాద్రి టాకీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.