Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఐదేళ్ల తర్వాత ఆ పని చేస్తున్న హీరో సిద్దార్థ్!
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం 'నిను వీడని నీడని నేనే'. హర్రర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. సందీప్ కిషన్ ఈ చిత్రానికి నిర్మాత కూడా. సందీప్ కిషన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ఇది. హర్రర్ తో పాటు ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింద.
హీరో సిద్దార్థ్ స్వతహాగా మంచి సింగర్ కూడా. సిద్దార్థ్ గతంలో బొమ్మరిల్లు, ఓయ్, ఓ మై ఫ్రెండ్ లాంటి చిత్రాలకు పాటలు పాడాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత సందీప్ కిషన్ కోసం మళ్లీ సింగర్ గా మారాడు. నిను వీడని నీడని నేనే చిత్రంలో సిద్దార్థ్ ఓ పాట పాడాడట. సోమవారం రోజే ఆ పాటని చెన్నైలో రికార్డ్ చేశారు. అన్యా సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
మాటలు బాగా చెప్పారు, ఇదీ మీ బుద్ది.. అభినందన్ని విడిచిపెట్టాలి అంటూ హీరో రామ్, సిద్దార్థ్!
సిద్దార్థ్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లు సందీప్ కిషన్ మహా శివరాత్రి సందర్భంగా ప్రకటించాడు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వేంకటాద్రి టాకీస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.