Don't Miss!
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- News Telangana Governor: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్-తమిళి సై రాజీనామా ఆమోదం..!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కొత్త విద్యను నేర్చుకుంటోన్న నాగార్జున: ఈ ఏజ్లోనూ అలాంటి సాహసాలకు రెడీ
ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు పోటీగా కనిపించడమే కాదు.. యంగ్ హీరోలు సైతం చేయలేని ఎన్నో సాహసాలను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న ఆయన.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక, కొంత కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న ఈ సీనియర్ హీరో.. ప్రస్తుతం విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అక్కినేని హీరో ఓ కొత్త విద్యను నేర్చుకుంటున్నాడని తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందిస్తోన్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. ఈ మూవీలో హాలీవుడ్ రేంజ్ ఫైటింగ్, ఛేజింగ్ సీక్వెన్స్లు డిజైన్ చేశారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం నాగార్జున ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నాడట. ఇందుకోసం ఓ నిపుణుడి దగ్గర కొద్ది రోజులుగా ఆయన నిర్విరామంగా మెళకువలు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఏజ్ బారైనా ఆయన సినిమా కోసం చేస్తున్న రిస్క్ గురించి తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఈ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తైంది. దీని కోసం విదేశీ షెడ్యూల్ను ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నారు. అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో అలాంటి సెట్స్ వేసి చిత్రీకరణ జరపబోతున్నారు. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తోంది.