Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
స్టార్ హీరో దర్శకత్వంలో నాగార్జున హిస్టారికల్ మూవీ.. మళ్ళీ రీ స్టార్ట్!
టాలీవుడ్ నవ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగానే కాకుండా అప్పుడప్పుడు వినూత్నమైన స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తూ ఉంటాడని అందరికి తెలిసిన విషయమే. తమిళ్ ఆడియెన్స్ కి కూడా ఈ హీరో సుపరిచితమే. అయితే రెండేళ్ల క్రితం ఆగిపోయిన ఇక ద్విభాషా చిత్రం కోసం నాగార్జున మళ్ళీ రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నారు.
ఇక హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. 2018లో ధనుష్ నాన్ రుద్ర అనే ఒక చిత్రాన్ని తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించాలని అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.
ఇక ఫైనల్ గా ధనుష్ త్వరలోనే ఆ ప్రాజెక్టును రీ స్టార్ట్ చేయబోతున్నాడు. ధనుష్ తో పాటు నాగార్జున ఆ సినిమాలో ఇక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. 15వ శతాబ్దంలోబి ఇక చారిత్రాత్మక అంశం చుట్టూ ఆ కథ నడుస్తుందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ని కొత్తగా రెడీ చేసేందుకు ధనుష్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.