Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తొలిసారి ఆ హీరోయిన్తో నాగార్జున: చిరంజీవి తర్వాత అక్కినేని హీరోతో రొమాన్స్
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఆయన.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం నూతన దర్శకుడు సోలోమన్ తెరకెక్కించిన 'వైల్డ్ డాగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసు నేపథ్యంతో రూపొందిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అక్కినేని అందగాడు మరో చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. తాజాగా దీని నుంచి ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది.
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుల్లో ప్రవీణ్ సత్తారు ఒకడు. 'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి హిట్ చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జునతో కలిశాడతను. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు చేస్తారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే నాగార్జున సరసన 16 ఏళ్ల అమ్మాయి అనిఖా సురేంద్రన్ ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుందట.
ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఈ మధ్య వేగం తగ్గించేసింది. ఇక, వివాహం తర్వాత ఆమె కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి సీనియర్ హీరోల్లో కాజల్.. చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' చేసింది. ఇప్పుడు 'ఆచార్య' చేస్తోంది. ఆయన తర్వాత నాగ్తో జత కట్టబోతుందీ బ్యూటీ. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు.