Don't Miss!
- News ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఎట్టకేలకు అల్లు శిరీష్ మొదలెట్టేశాడు.. ఫస్ట్ డే సెట్లో స్పెషల్ గెస్ట్
అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై కంటే సోషల్ మీడియాలో ఫుల్ జోష్లో ఉంటాడని, కామెడీ టైమింగ్ అదరగొడతాని నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్నట్టుగా తెరపైనా దుమ్ములేపు అంటూ అల్లు అభిమానులు కోరుతుంటారు. అయితే అల్లు శిరీష్ మాత్రం తెరపై ఓ సరైన హిట్ కొట్టలేకపోతున్నాడు. అల్లు బ్రాండ్, మెగా ట్యాగ్కు సరితూగే ఒక్క సక్సెస్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తూనే ఉన్నాడు.
గతేడాది ఏబీసీడీ అంటూ మలయాళీ రీమేక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ భాషలో ఆ సినిమా వర్కవుట్ అయింది. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అలా అల్లు శిరీష్ చేసిన ప్రయత్నం వృథా అయింది. ఆ తరువాత అల్లు శిరీష్ ఆచితూచి మరో ప్రాజెక్ట్ను ఎంచుకున్నాడు. ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పేందుకు చాలా సమయం పడితే.. సెట్స్ పైకి ఎక్కేందుకు మరింత సమయం పట్టింది.
లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీ మొత్తానికి నిన్న ప్రారంభమైంది. షూటింగ్ సెట్లో అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, షాట్ గ్యాప్లోకూడా శానిటైజ్ చేస్తున్నారని తెలిపాడు. అయితే ఈ షూటింగ్ సెట్కు మొదటి రోజు అల్లు అన్విత (అల్లు బాబీ కూతురు) స్పెషల్ గెస్ట్గా వచ్చింది. లేడీ బాస్ ఇప్పటినుంచే అన్నీ సవ్యంగా జరుగుతున్నాయో లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తోందని అల్లు శిరీష్ కామెంట్ చేశాడు.