పవన్ కళ్యాణ్ పిలుపు: తిత్లీ తుఫాను బాధిత గ్రామాలకు అల్లు అర్జున్ సహాయం
తిత్లీ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు అతలా కుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను కారణంగా ఆ ప్రాంతంలో చాలా నష్టం జరిగింది. చాలా చోట్ల తాగునీరు కలుషితమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తుఫాన్ బాధిత గ్రామాలను సందర్శించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీర్చడానికి దాతలు ముందుకు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు.
మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని.. కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు గాను 3 ఆర్వో వాటర్ ప్లాంట్స్, ఒక బోర్ వెల్ వేయించేందుకు ముందుకు సహాయం అందించారు.

ఈ వాటర్ ప్లాంట్స్, బోరు ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు సురక్షిత మంచి నీరు అందనుంది. తమ ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయినందు వల్ల ఆర్వో వాటర్ ప్లాంట్స్ తమకు ఎంతో మేలు చేస్తాయని అంటన్నారు అక్కడి ప్రజలు.


Click it and Unblock the Notifications











