Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్కు కథ వినిపించిన గీత గోవిందం దర్శకుడు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో సినిమా ప్రారంభించలేదు. నా పేరు సూర్య నిరాశపరచడంతో బన్నీ టైం తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తో తదుపరి చిత్రం అంటూ జోరుగా ఉహాగానాలు సాగినా కథపై బన్నీ పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు.
తాజాగా అల్లు అర్జున్ కు ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న పరుశురాం అల్లు అర్జు కోసం ఓ కథ సిద్ధం చేసి వినిపించాడట. పరిసరం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన రెండు చిత్రాలు శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం విజయాలుగా నిలిచాయి.
మరో వైపు వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ కూడా ఓ కథని బన్నీకి వినిపించాడట. ఈ ఇద్దరు దర్శకులకు తన నిర్ణయం ప్రకటించడానికి బన్నీ టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఓకె చెబుతాడనేది ఆసక్తిగా మారింది.