Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అల్లు అర్జున్కు కథ వినిపించిన గీత గోవిందం దర్శకుడు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో సినిమా ప్రారంభించలేదు. నా పేరు సూర్య నిరాశపరచడంతో బన్నీ టైం తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తో తదుపరి చిత్రం అంటూ జోరుగా ఉహాగానాలు సాగినా కథపై బన్నీ పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు.
తాజాగా అల్లు అర్జున్ కు ఇద్దరు టాలెంటెడ్ దర్శకులు కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న పరుశురాం అల్లు అర్జు కోసం ఓ కథ సిద్ధం చేసి వినిపించాడట. పరిసరం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించిన రెండు చిత్రాలు శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం విజయాలుగా నిలిచాయి.
మరో వైపు వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ కూడా ఓ కథని బన్నీకి వినిపించాడట. ఈ ఇద్దరు దర్శకులకు తన నిర్ణయం ప్రకటించడానికి బన్నీ టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరికి ఓకె చెబుతాడనేది ఆసక్తిగా మారింది.