Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్: ఆల్టైం రికార్డును క్రియేట్ చేసిన అల్లు అర్జున్
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ ఇచ్చిన జోష్లో అతడు ఆ వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా రేంజ్తో రూపొందుతోన్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది రిలీజ్కు ముందే వరుస పెట్టి రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే మరోటి నమోదైంది.
అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుని పుష్ప మూవీలోని 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ వీడియో తాజాగా 70 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరుకుంది. అలాగే, 1.6 మిలియన్ లైకులను కూడా అందుకుంది. తద్వారా టాలీవుడ్లో ఆల్టైం రికార్డును క్రియేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతోన్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే గంథపు చెక్కల స్మగ్లర్గా నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అతడు ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో డీ గ్లామర్ రోల్ను చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.