Don't Miss!
- News Lok Sabha Election 2024 Phase2 Polling LIVE: రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధం..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గోవా వెళ్లబోతున్న అల్లు అర్జున్: ఐకాన్ స్టార్తో అక్కడేం ప్లాన్ చేశారబ్బా
గత ఏడాది ఆరంభంలోనే 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఉత్సాహంతోనే వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది 'పుష్ప' అనే టైటిల్తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఈ క్రమంలోనే ఓ కీలకమైన షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే గోవా వెళ్లబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది.
'పుష్ప' మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్కు సంబంధించి ఇప్పటికే దాదాపు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాని కోసం జూలైలో చిత్రీకరణను పున: ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో ఎప్పుడో సెట్ను కూడా నిర్మించారు. దీని తర్వాత ఓ కీలకమైన ఎపిసోడ్ కోసం గోవాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాదాపు వారం నుంచి పది రోజల పాటు సాగే దీని కోసం బన్నీ సహా కొందరు సభ్యులు అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్, విలన్ ఉండరనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతానికి గోవాలో షూటింగ్లపై నిషేదం కొనసాగుతోంది. త్వరలోనే ఇది తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతనే 'పుష్ప' యూనిట్ అక్కడకు వెళ్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.