Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సర్కారు వారి పాట’ నుంచి షాకింగ్ అప్డేట్: అసలు ఆ హీరో ఇందులో చేయట్లేదట
వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మూడు సూపర్ డూపర్ హిట్ల తర్వాత అతడు చేస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భారీ బడ్జెట్తో సందేశాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసేది విలన్ పాత్ర కాదని, ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని ఓ న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. అసలు ఈ సినిమాలో అర్జున్ సర్జా నటించడం లేదట. అంతేకాదు, ఎటువంటి పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆయనతో సంప్రదింపులు కూడా జరపలేదని తెలుస్తోంది. ఇక, ఇందులో విలన్గా డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖనిని తీసుకున్న విషయం తెలిసిందే.
బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ 'సర్కారు వారి పాట'ను తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో మహేశ్ బాబు ఫుల్ లెంగ్త్ మాస్ రోల్లో కనిపించబోతున్నాడని కూడా అంటున్నారు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది విడుదల కాబోతుంది.