Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలకృష్ణ కార్పోరేట్ పాలిటిక్స్.. హై వోల్టేజ్ కథను సెట్ చేసిన దర్శకుడు
నందమూరి బాలకృష్ణ కూడా సినిమా షూటింగ్స్ విషయాల్లో స్పీడ్ పెంచుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టేందుకు రెడీ అయ్యారు. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే అఖండ సినిమాను విడుదల చేసి మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చేవారు. ఇక అఖండ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఫినిష్ కానుంది.
ప్రస్తుతం దర్శకుడు బోయపాటి చివరి షెడ్యూల్ కోసం కొన్ని లొకేషన్స్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా అనంతరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సినిమా ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అయితే ఇటీవల డైరెక్టర్ శ్రీవాస్ తో కూడా ఒక కథను ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆ కథ కార్పోరేట్ పాలిటిక్స్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఇక ఆ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అఖండ అనంతరం గోపిచంద్ మలినేని సినిమాతో పాటు శ్రీవాస్ సినిమాను కూడా ఒకేసారి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి కూడా ఎదురుచూస్తున్నాడు. రామరావు గారు అనే టైటిల్ తో కథను సెట్ చేసి ఏళ్ళు గడుస్తోంది. మధ్యలో కొన్ని మార్పులు చేసినప్పటికీ బాలయ్య అంతగా సంతృప్తి చెందడం లేదట. మరి అనిల్ ఎలా ఒప్పిస్తాడో చూడాలి.