Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జున కోసం ఆ నిర్మాతల సాహసం: ఆయన కెరీర్లోనే తొలిసారి ఆ రేంజ్లో
ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటైన ఫిజిక్తో కనిపిస్తూ.. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. జయాపజయాలను ఏమాత్రం చూడకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఆయనకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నాడు నాగ్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మరో సినిమాను చేస్తున్నాడు.
'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడవేగ' వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తి అయింది. ఇక, రెండో షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ షెడ్యూల్లు ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫారెన్లో జరగాల్సిన షెడ్యూళ్లను క్యాన్సిల్ చేసేశారు. ఇప్పుడు వాటిని ప్రత్యేకమైన సెట్లు వేసి చిత్రీకరించాలని నిర్ణయించారు.
ఈ సినిమా కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ను నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ అని అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తోంది.