Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సాహో దర్శకుడికి మరో షాక్.. మనసు మార్చుకున్న మెగాస్టార్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా మెగాస్టార్ తదుపరి సినిమాలకు సంబంధించిన కథలపై చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటికే ముగ్గురి దర్శకులకు అవకాశం ఇచ్చిన మెగాస్టార్ ఫైనల్ గా స్క్రిప్ట్ బాగుంటేనే సినిమా చేస్తానని చెప్పారట. కొరటాల శివ సినిమా తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు గాని ముందుగా మెగాస్టార్ అయితే సాహో దర్శకుడు సుజిత్ తోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను ఇంకా ఫుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేయలేదు. అయితే ఇంతలో జై లవకుశ దర్శకుడు బాబీ చెప్పిన కథకు మెగాస్టార్ ఎట్రాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
ముందు బాబీ తోనే సినిమా చేసి ఆ తరువాత సుజిత్ ప్రాజెక్టును సెట్స్ పైకి తేవాలని మెగాస్టార్ మనసు మార్చుకున్నారట. మరోవైపు మెహర్ రమేష్ కి కూడా మెగాస్టార్ ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాబీ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ పనులకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నాడు. దీంతో సాహో దర్శకుడు చేయాలనుకున్న సినిమా మరీంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.