Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఫ్యామిలీస్.. ఫర్హాన్, నాపై వివక్ష.. అభయ్ డియోల్ ఫైర్
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్లో బంధుప్రీతి, ఫేవరిటిజంపై మరోసారి భారీగా చర్చకు దారి తీసింది. పలువురు కరణ్ జోహర్, సోనమ్ కపూర్, ఆలియాభట్పై నెటిజన్లు, పలువురు సినిమా ప్రముఖులు తీవ్రమైన ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్లో కొన్ని కుటుంబాల అరాచకాలపై హీరో అభయ్ డియోల్ భగ్గుమన్నారు.
బాలీవుడ్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం, ఏకపక్ష నిర్ణయాలపై అభయ్ డియోల్ మండిపడ్డారు. 2011లో విడుదలైన జిందగీ నా మిలేగి దొబారా చిత్రానికి సంబంధించిన అవార్డుల విషయంలో తనకు, ఫర్హాన్ అఖ్తర్కు అన్యాయం జరిగిందని, తమపై వివక్ష చూపించారు అని విమర్శలు చేశారు. ఆ చిత్రంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్, నేను ముగ్గురు హీరోలం. అయితే ఆ ఏడాది జరిగిన అవార్డుల ఫంక్షన్లో హృతిక్ను హీరోగా పరిగణించి నన్ను, ఫర్హాన్ను సహాయ నటులుగా డిక్లేర్ చేశారు. దాంతో నేను, ఫర్హాన్ షాక్ తిన్నాం అని అభయ్ తెలిపారు.
అయితే ఫర్హాన్, తనను సహాయ నటుల క్యాటగిరిలో ఎంపిక చేసి.. అదే సమయంలో కత్రినాను లీడింగ్ హీరోయిన్ క్యాటగిరీకి సెలెక్ట్ చేశారు. ఇది ఎవరికీ అర్ధం కాని ఇండస్ట్రీ పెద్దల స్వంత లాజిక్. చాలా మంది కోవర్డులు కొందరికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేసి.. వారి కెరీర్లు నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఆ అవార్డులను నేను బాయ్కాట్ చేస్తే.. ఫర్హాన్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అని అభయ్ డియోల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు.