Don't Miss!
- News ఐరాస భద్రతామండలిలో భారత్ కు శాశ్వత హోదా- ఎలాన్ మస్క్ డిమాండ్ కు బైడెన్ ఓకే..!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్న బాలీవుడ్ కండల వీరుడు
బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మెగా హీరో అల్లు అర్జున్. సినిమా సినిమాకూ వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిన అతడు.. డ్యాన్స్లో మాత్రం తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు. ఈ కారణంగానే ఇండియాలోని అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకడిగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి మాట్లాడాడు.
యాక్షన్ సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.. తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో లైవ్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ నెటిజన్.. 'టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పండి' అంటూ అతడిని అడిగాడు. దానికి స్పందించిన టైగర్.. 'బన్నీ నాకు బాగా తెలుసు. అతడి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు.. బాలీవుడ్లోని చాలా మంది స్టార్లకు.. ఇక్కడి సినీ ప్రియులకు కూడా ఇష్టమే. ఇండియాలోని ఉత్తమ డ్యాన్సర్లలో అతడు కూడా ఒకడని చెప్పొచ్చు' అని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం 'పరుగు'. ఈ సినిమా హిందీ రీమేక్ 'హీరోపంటి' ద్వారానే టైగర్ ష్రాఫ్ బాలీవుడ్కు హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు.. బన్నీ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అతడు గంథపు చెక్కల స్మగ్లర్గా నటిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లిలో జరుగుతోంది.